ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్వో శ్రీనివాస్ రావు
ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్వో శ్రీనివాస్ రావు
Editor Desk
హైదరాబాద్, శ్రీరామకృష్ణపురం: మహేశ్వరం నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (AERO) శ్రీనివాస్ రావు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో పాల్గొని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు.
మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్నగర్ సర్కిల్, శ్రీరామకృష్ణపురం డివిజన్లోని 62వ పోలింగ్ బూత్ను ఆయన సందర్శించి కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు జాబితాలో తమ పేరును ఎలా వెతకాలి, ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి, అవసరమైన వివరాలను ఎలా సమర్పించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 62వ బూత్ లెవెల్ ఏజెంట్ (BLA), గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్, బీఎల్ఓ సూపర్వైజర్ ఎర్ర వంశీ, బీఎల్ఓ బోడుపల్లి పద్మతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి