Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 04:58 PM

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. మనోహర్ సందేశం

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. మనోహర్ సందేశం

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. మనోహర్ సందేశం
June 30, 2026 03:12 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, :

ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యులు పోషిస్తున్న పాత్ర అమూల్యమని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. ఎం. మనోహర్ పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశంలో ప్రతి ఏడాది జూలై 1న ప్రముఖ వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డా. బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, మానవాళి ప్రాణాలను కాపాడే అత్యంత పవిత్రమైన సేవా వృత్తి అని అన్నారు.

వైద్యులు తమ విజ్ఞానం, అనుభవం, కరుణ, అంకితభావంతో ప్రతి రోగికి ఆరోగ్యాన్ని, ఆశను, కొత్త జీవితాన్ని అందిస్తున్నారని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి ప్రజల కోసం అహర్నిశలు సేవలందించిన వైద్యుల త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం, నాలుగు బస్తీ దవాఖానాలు, 99 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌లు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 23 ఆయుష్ డిస్పెన్సరీలు, ఒక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అలాగే బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

మాతా–శిశు సంక్షేమం, టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన, డెంగ్యూ, మలేరియా నియంత్రణ, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల గుర్తింపు, చికిత్స, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల అమలులో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వైద్యులు ప్రతి రోగిని తమ కుటుంబ సభ్యుడిగా భావించి సేవలందిస్తున్నారని, వారి నిబద్ధత, మానవత్వం, సేవాభావం సమాజానికి ఆదర్శమని డా. మనోహర్ అన్నారు. వైద్య వృత్తి గౌరవాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని, వైద్యుల పట్ల విశ్వాసం, పరస్పర గౌరవంతో వ్యవహరించినప్పుడే ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రతి వైద్యుడికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News