దివ్యాంగుల హక్కుల కోసం వేదన దీక్ష జేఏసీ మద్దతు.. ఉస్మానియాలో పోస్టర్ ఆవిష్కరణ.
దివ్యాంగుల హక్కుల కోసం వేదన దీక్ష జేఏసీ మద్దతు.. ఉస్మానియాలో పోస్టర్ ఆవిష్కరణ.
Editor Desk
హైదరాబాద్,
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవ సాధన కోసం సోషల్ జస్టిస్ పార్టీ చేపట్టనున్న వేదన దీక్షకు విశ్వవిద్యాలయాల దివ్యాంగుల జేఏసీ మద్దతు ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం దీక్ష పోస్టర్ను ఆవిష్కరించి, రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు, మేధావులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల హక్కులను చట్టబద్ధంగా అమలు చేసి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్తపేట హుడా కాంప్లెక్స్ వద్ద నిర్వహించే ఈ వేదన దీక్ష దివ్యాంగుల భవిష్యత్తుకు కీలక మలుపు అవుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాజ్యాధికారం ఫోరం అధ్యక్షుడు వంశీరాజ్ రామచంద్ర, కె. రాజ్యలక్ష్మి, బండి శ్రీనివాసరావు, మారవేణి చంద్రశేఖర్ యాదవ్, పల్స ఆంజనేయులు గౌడ్, మోదాల సైదులు యాదవ్, కస్తూరి వేణుగోపాల్ రెడ్డి, దానమ్మ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం ప్రకటించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి