ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం
ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం
Editor Desk
నల్గొండ: తెలంగాణ ఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలోని ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల కేంద్ర ఫోరం (ఉమ్మడి నల్లగొండ జిల్లా) 2026–2029 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం ఆర్టికల్–18, ఎన్నికల నోటిఫికేషన్ నం.02/ఎలక్షన్/ఐటీఐ ఫోరం మేరకు ప్రభుత్వ ఐటీఐ, న్యూ నల్లగొండలో ఎన్నికల ప్రక్రియ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు.
ప్రతి పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలుకావడంతో పరిశీలన అనంతరం అన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ఎ. హేమంత్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎ. శ్రీనివాస్, విజయనిర్మల, సీహెచ్. దామోదర్, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. విష్ణుమోహన్, సంయుక్త కార్యదర్శులుగా ఎ. శిరీష, రామలింగయ్య, అల్బెలా, కోశాధికారిగా సీహెచ్. పరమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధీర్, పబ్లిసిటీ సెక్రటరీగా టి. చంద్రకర్, ఈసీ సభ్యులుగా టి. రేణుక, ఎ. కనకయ్య, ఎన్. శ్రీనివాస్, సీహెచ్. వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి