తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ తండ్రి కీ.శే. పి. లింగప్ప పాటిల్ 20వ వర్థంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కీ.శే. లింగప్ప పాటిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని స్మరించుకుంటూ, ఆయన జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రజలకు ఉపయోగపడే శాశ్వత సౌకర్యాలను కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి