14 వ వార్డు గణేష్ నగర్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
14 వ వార్డు గణేష్ నగర్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
K.RAVI
* మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
*మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
మున్సిపల్ కేంద్ర పరిధిలోని 14వ వార్డు గణేష్ నగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టామని వివరించారు. వార్డుల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డ్ కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమా మహేశ్వరి సాయిలు, 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాస్, కో-ఆప్షన్ సభ్యులు సందగల్ల విజయ సతీష్, పస్తం గంగరాములు, కాలనీవాసులు వర్కాల రవి, కామిషెట్టి చంద్ర శేఖర్, ఉడుగు వెంకటేష్, చెరుకు రాజు, శివకుమార్ చారి, బాబా, గుత్తా ధనలక్ష్మి, తండా లక్ష్మమ్మ, పందుల విజయ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి