బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు
బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు
Sthanikam District Staff Reporter
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బేగంపేట్లోని కిమ్స్-సన్షైన్ హాస్పిటల్, భువనగిరి ఐఎంఎ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భువనగిరి వివేరా హోటల్లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ...సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, భగవంతుడు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తారని ఆయన అన్నారు. వైద్యులు, ప్రజలతో ఆర్థిక సంబందాలు కాకుండా ఆత్మీయ బందాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి డాక్టర్, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారని, కానీ కొందరు ప్రజలు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తూ, రోగాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎంఎ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ చైతన్య, కోశాధికారి డాక్టర్ కిరణ్,సభ్యులు డాక్టర్ ప్రశాంతి రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ,బేగంపేట కిమ్స్-సన్షైన్ హాస్పిటల్కు చెందిన సీనియర్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నివేదిత సాయిచంద్ర ఎ.ప్రసూతి, గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ అశ్విని దేవరశెట్టి, సీనియర్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ వి.లక్ష్మణ్ బాబు,సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. సాయి కృష్ణ, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కిరణ్ మాచా,కిమ్స్-సన్షైన్ హాస్పిటల్ డీజీఎం-బిజినెస్ డెవలప్మెంట్ అజయ్ ఠాకూర్,అసిస్టెంట్ మేనేజర్ యశ్వంత్ తదితరులు పాల్గొని అతిథులను ఆహ్వానించి సత్కరించారు.వైద్యుల సేవలను కొనియాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి