Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:06 AM

బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు
July 02, 2026 10:30 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బేగంపేట్‌లోని కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌, భువనగిరి ఐఎంఎ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భువనగిరి వివేరా హోటల్లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ...సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, భగవంతుడు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తారని ఆయన అన్నారు. వైద్యులు, ప్రజలతో ఆర్థిక సంబందాలు కాకుండా ఆత్మీయ బందాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి డాక్టర్, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారని, కానీ కొందరు ప్రజలు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తూ, రోగాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎంఎ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ చైతన్య, కోశాధికారి డాక్టర్ కిరణ్,సభ్యులు డాక్టర్ ప్రశాంతి రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ,బేగంపేట కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నివేదిత సాయిచంద్ర ఎ.ప్రసూతి, గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ అశ్విని దేవరశెట్టి, సీనియర్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ వి.లక్ష్మణ్ బాబు,సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. సాయి కృష్ణ, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కిరణ్ మాచా,కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ డీజీఎం-బిజినెస్ డెవలప్‌మెంట్ అజయ్ ఠాకూర్,అసిస్టెంట్ మేనేజర్ యశ్వంత్ తదితరులు పాల్గొని అతిథులను ఆహ్వానించి సత్కరించారు.వైద్యుల సేవలను కొనియాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News