గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు గూగుల్ పే QR కోడ్ సౌండ్ బాక్స్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కంగ్టి గ్రామ పరిధిలో కొంతమంది షాప్ యజమానులకు గూగుల్ పే నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేసి, ఒక QR కోడ్ పంపిస్తామని, దానిని స్కాన్ చేసి రూ.5,000 చెల్లిస్తే ఇప్పటివరకు కట్ అయిన ఛార్జీలతో కలిపి రూ.10,000 రిఫండ్ వస్తుందని నమ్మిస్తున్నారు. ఈ మాటలు నమ్మి ఒక వ్యాపారి QR కోడ్ స్కాన్ చేసి, తన షాప్ పేరు కనిపించడంతో పాస్వర్డ్ నమోదు చేయగా అతని ఖాతా నుంచి రూ.9,500 మాయమయ్యాయి. ఇదే విధంగా నలుగురు వ్యాపారుల నుంచి సుమారు రూ.40 వేల వరకు సైబర్ నేరగాళ్లు కాజేశారు. గూగుల్ పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపు సంస్థల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, QR కోడ్లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, స్కాన్ చేయవద్దని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను లేదా సైబర్ హెల్ప్లైన్ను సంప్రదించాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి