Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:37 PM

గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి
July 02, 2026 03:40 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు గూగుల్ పే QR కోడ్ సౌండ్ బాక్స్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కంగ్టి గ్రామ పరిధిలో కొంతమంది షాప్ యజమానులకు గూగుల్ పే నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేసి, ఒక QR కోడ్ పంపిస్తామని, దానిని స్కాన్ చేసి రూ.5,000 చెల్లిస్తే ఇప్పటివరకు కట్ అయిన ఛార్జీలతో కలిపి రూ.10,000 రిఫండ్ వస్తుందని నమ్మిస్తున్నారు. ఈ మాటలు నమ్మి ఒక వ్యాపారి QR కోడ్ స్కాన్ చేసి, తన షాప్ పేరు కనిపించడంతో పాస్‌వర్డ్ నమోదు చేయగా అతని ఖాతా నుంచి రూ.9,500 మాయమయ్యాయి. ఇదే విధంగా నలుగురు వ్యాపారుల నుంచి సుమారు రూ.40 వేల వరకు సైబర్ నేరగాళ్లు కాజేశారు. గూగుల్ పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపు సంస్థల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, QR కోడ్‌లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, స్కాన్ చేయవద్దని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను లేదా సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News