Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం
01-07-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి, తంగడపల్లి పీహెచ్ సి లు సందర్శించిన విద్యార్థులు

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజంలో వైద్యులను దేవుడిలా భావిస్తారని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కాటమయ్య అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్‌లోని త్రినిటీ విద్యాసంస్థల 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు తంగడపల్లి పీహెచ్‌సీని సందర్శించారు.​వైద్య వృత్తిపై అవగాహన, జిజ్ఞాసతో ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాండురంగం ఆధ్వర్యంలో వైద్యులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వారికి మిఠాయిలు తినిపించి, మనీప్లాంట్‌ మొక్కలను బహూకరించి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాటమయ్య మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానేసి రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులకు సమాజంలో ఉన్నత గౌరవం ఉందన్నారు. విద్యార్థులను ఉత్తేజపరిచేలా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న త్రినిటీ విద్యాసంస్థల మేనేజ్‌మెంట్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్‌ కేవీబీ కృష్ణారావు, డైరెక్టర్‌ అండ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉజ్జీని మంజుల, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం

Article Image

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి, తంగడపల్లి పీహెచ్ సి లు సందర్శించిన విద్యార్థులు

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజంలో వైద్యులను దేవుడిలా భావిస్తారని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కాటమయ్య అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్‌లోని త్రినిటీ విద్యాసంస్థల 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు తంగడపల్లి పీహెచ్‌సీని సందర్శించారు.​వైద్య వృత్తిపై అవగాహన, జిజ్ఞాసతో ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాండురంగం ఆధ్వర్యంలో వైద్యులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వారికి మిఠాయిలు తినిపించి, మనీప్లాంట్‌ మొక్కలను బహూకరించి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాటమయ్య మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానేసి రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులకు సమాజంలో ఉన్నత గౌరవం ఉందన్నారు. విద్యార్థులను ఉత్తేజపరిచేలా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న త్రినిటీ విద్యాసంస్థల మేనేజ్‌మెంట్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్‌ కేవీబీ కృష్ణారావు, డైరెక్టర్‌ అండ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉజ్జీని మంజుల, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News