వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం
వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం
K.RAVI
చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి, తంగడపల్లి పీహెచ్ సి లు సందర్శించిన విద్యార్థులు
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజంలో వైద్యులను దేవుడిలా భావిస్తారని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కాటమయ్య అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్లోని త్రినిటీ విద్యాసంస్థల 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు తంగడపల్లి పీహెచ్సీని సందర్శించారు.వైద్య వృత్తిపై అవగాహన, జిజ్ఞాసతో ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండురంగం ఆధ్వర్యంలో వైద్యులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వారికి మిఠాయిలు తినిపించి, మనీప్లాంట్ మొక్కలను బహూకరించి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాటమయ్య మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానేసి రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులకు సమాజంలో ఉన్నత గౌరవం ఉందన్నారు. విద్యార్థులను ఉత్తేజపరిచేలా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న త్రినిటీ విద్యాసంస్థల మేనేజ్మెంట్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జీని మంజుల, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి