Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 08:08 PM

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం
July 01, 2026 06:52 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి, తంగడపల్లి పీహెచ్ సి లు సందర్శించిన విద్యార్థులు

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజంలో వైద్యులను దేవుడిలా భావిస్తారని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కాటమయ్య అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్‌లోని త్రినిటీ విద్యాసంస్థల 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు తంగడపల్లి పీహెచ్‌సీని సందర్శించారు.​వైద్య వృత్తిపై అవగాహన, జిజ్ఞాసతో ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాండురంగం ఆధ్వర్యంలో వైద్యులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వారికి మిఠాయిలు తినిపించి, మనీప్లాంట్‌ మొక్కలను బహూకరించి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాటమయ్య మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానేసి రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులకు సమాజంలో ఉన్నత గౌరవం ఉందన్నారు. విద్యార్థులను ఉత్తేజపరిచేలా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న త్రినిటీ విద్యాసంస్థల మేనేజ్‌మెంట్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్‌ కేవీబీ కృష్ణారావు, డైరెక్టర్‌ అండ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉజ్జీని మంజుల, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News