ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఆచూకీ తెలిసిన వారు డయల్–100/112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి
ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఆచూకీ తెలిసిన వారు డయల్–100/112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి
Editor Desk
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఫణి అలియాస్ జానకి ఫణి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన భార్య శ్రీమతి తనీరు జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గత కొంతకాలంగా శ్రీనివాస్ ఫణి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.45 గంటలకు ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, స్నేహితులు, ఆస్పత్రులు తదితర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై FIR నెం.1220/2026 కింద మాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీనివాస్ ఫణి ఆచూకీ తెలిసిన వారు వెంటనే డయల్–100, 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని వనస్థలిపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి