Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:52 AM

అనాథ చిన్నారికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. రూ.70 వేల స్థిరనిధి ఏర్పాటు.. మానవత్వం చాటిన బస్వాపురం ఆలుమ్ని

అనాథ చిన్నారికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. రూ.70 వేల స్థిరనిధి ఏర్పాటు.. మానవత్వం చాటిన బస్వాపురం ఆలుమ్ని

అనాథ చిన్నారికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు.  రూ.70 వేల స్థిరనిధి ఏర్పాటు.. మానవత్వం చాటిన బస్వాపురం ఆలుమ్ని
30-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012–13 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లి కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం అందించారు.


ముత్తిరెడ్డిగూడెంకు చెందిన గంగాదేవి జ్యోతి ఇటీవల మృతి చెందడంతో ఆమె కుమార్తె నందిత, కుమారుడు తల్లిని కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు నందిత ఉన్నత చదువులకు ఉపయోగపడేలా ఆమె పేరుపై పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్రం (కేవీపీ) కింద రూ.70 వేల స్థిరనిధి (ఎఫ్‌డీ) ఏర్పాటు చేశారు.


పూర్వ విద్యార్థుల ఈ సేవాభావాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, బాలల హక్కుల సంఘం నాయకులు అభినందించారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ కార్యక్రమం మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.

Sthanikam

అనాథ చిన్నారికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. రూ.70 వేల స్థిరనిధి ఏర్పాటు.. మానవత్వం చాటిన బస్వాపురం ఆలుమ్ని

Article Image

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012–13 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లి కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం అందించారు.


ముత్తిరెడ్డిగూడెంకు చెందిన గంగాదేవి జ్యోతి ఇటీవల మృతి చెందడంతో ఆమె కుమార్తె నందిత, కుమారుడు తల్లిని కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు నందిత ఉన్నత చదువులకు ఉపయోగపడేలా ఆమె పేరుపై పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్రం (కేవీపీ) కింద రూ.70 వేల స్థిరనిధి (ఎఫ్‌డీ) ఏర్పాటు చేశారు.


పూర్వ విద్యార్థుల ఈ సేవాభావాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, బాలల హక్కుల సంఘం నాయకులు అభినందించారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ కార్యక్రమం మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News