అనాథ చిన్నారికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. రూ.70 వేల స్థిరనిధి ఏర్పాటు.. మానవత్వం చాటిన బస్వాపురం ఆలుమ్ని
అనాథ చిన్నారికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. రూ.70 వేల స్థిరనిధి ఏర్పాటు.. మానవత్వం చాటిన బస్వాపురం ఆలుమ్ని
Editor Desk
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012–13 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లి కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం అందించారు.
ముత్తిరెడ్డిగూడెంకు చెందిన గంగాదేవి జ్యోతి ఇటీవల మృతి చెందడంతో ఆమె కుమార్తె నందిత, కుమారుడు తల్లిని కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు నందిత ఉన్నత చదువులకు ఉపయోగపడేలా ఆమె పేరుపై పోస్టాఫీస్లో కిసాన్ వికాస్ పత్రం (కేవీపీ) కింద రూ.70 వేల స్థిరనిధి (ఎఫ్డీ) ఏర్పాటు చేశారు.
పూర్వ విద్యార్థుల ఈ సేవాభావాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, బాలల హక్కుల సంఘం నాయకులు అభినందించారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ కార్యక్రమం మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి