యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. ఏపీ సభ్యుల నియామకంపై వివాదం
యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. ఏపీ సభ్యుల నియామకంపై వివాదం
Komidala Mahender reddy
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మొత్తం 10 మంది సభ్యులతో కూడిన బోర్డును ఖరారు చేసింది.ప్రకటించిన సభ్యుల జాబితాలో ప్రముఖ సినీనటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పేరు కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ట్రస్ట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులను సభ్యులుగా నియమించడంపై తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో స్థానికులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం భక్తుల సేవ, దేవాలయ అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యుల ఎంపిక చేపట్టినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు నియామకాలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి