Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 12:49 AM

యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. ఏపీ సభ్యుల నియామకంపై వివాదం

యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. ఏపీ సభ్యుల నియామకంపై వివాదం

యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. ఏపీ సభ్యుల నియామకంపై వివాదం
June 30, 2026 10:55 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మొత్తం 10 మంది సభ్యులతో కూడిన బోర్డును ఖరారు చేసింది.ప్రకటించిన సభ్యుల జాబితాలో ప్రముఖ సినీనటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పేరు కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ట్రస్ట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులను సభ్యులుగా నియమించడంపై తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో స్థానికులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ప్రభుత్వం మాత్రం భక్తుల సేవ, దేవాలయ అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యుల ఎంపిక చేపట్టినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు నియామకాలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News