వైద్యుల సేవలు సమాజానికి అమూల్యం: ఎమ్మెల్యే చింత ప్రభాకర్
వైద్యుల సేవలు సమాజానికి అమూల్యం: ఎమ్మెల్యే చింత ప్రభాకర్
Krishna
డాక్టర్స్ డే సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్యులను ఘనంగా సత్కరించి, మెమెంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు ఎంతో అమూల్యమైనవని, ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే ప్రతి వైద్యుడు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి డాక్టర్స్ డే కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెజింతల్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మసూద్, శ్రవణ్ రెడ్డి, వాజిత్, విష్ణు, జలేందర్, దిలీప్, సంగమేష్, అఖిల్, హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి