విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం తప్పనిసరి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం తప్పనిసరి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Krishna
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న మూడో జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు అధికారులు, సిబ్బందిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకే ఈ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విధుల్లో సమర్థవంతంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యంతో పాటు శాస్త్రీయ దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, పరిరక్షణపై పూర్తి అవగాహన అవసరమని అన్నారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ప్రింట్స్, సాక్ష్యాధారాల హ్యాండ్లింగ్, బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాల ట్రాకింగ్, ఎక్స్ప్లోసివ్ హ్యాండ్లింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులతో పాటు జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ డీఎస్పీ సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్ఐలు సురేష్, డానియెల్తో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి