ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో వైద్యుల సేవలు చిరస్మరణీయం: డా. చినుకాని శివ ప్రసాద్
ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో వైద్యుల సేవలు చిరస్మరణీయం: డా. చినుకాని శివ ప్రసాద్
K.RAVI
ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో వైద్యులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవని తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చినుకాని శివ ప్రసాద్ కొనియాడారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశంలోని వైద్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి అనేది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, అది మానవాళికి అంకితమైన అత్యంత మహోన్నతమైన సేవ అని అభివర్ణించారు. ప్రతి వైద్యుడు తన అంకితభావం, అపార నైపుణ్యం, మానవతా దృక్పథంతో లక్షలాది మంది రోగుల జీవితాల్లో కొత్త ఆశలను, వెలుగులను నింపుతున్నారని ప్రశంసించారు."ప్రజలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే, అవి రాకముందే నివారణోపాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో ముఖ్యం. సమాజంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ ప్రాణాలు కాపాడే వైద్యుల సేవలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత."ప్రజారోగ్య పరిరక్షణలో హోమియోపతి వైద్యుల పాత్ర కూడా ఎంతో కీలకమైనదని ఆయన గుర్తుచేశారు. దేశంలోని వైద్యులందరికీ, ముఖ్యంగా హోమియోపతి వైద్యులకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్తులో ప్రజారోగ్య రక్షణలో వారి సేవలు మరింత విస్తరించాలని డాక్టర్ శివ ప్రసాద్ ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి