రేవంత్ రెడ్డిపై విషప్రచారం మానుకోవాలి
రేవంత్ రెడ్డిపై విషప్రచారం మానుకోవాలి
Harish K
నల్గొండలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు
ప్రజల నుంచి లభించిన విశేష ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ల కృష్ణారావు,మైలారి శెట్టి భాస్కర్ ఆరోపించారు. మాజీఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. మంగళవారం నాడు స్థానిక విలేకరుల సమావేశంలో వారు
మాట్లాడుతూ, నల్గొండ సభ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరుగుతున్న
ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకత్వం భయాందోళనకు గురైందన్నారు. అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేబొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యమంత్రిని విమర్శించే ముందు తన రాజకీయ చరిత్రను ఒకసారి ఆత్మపరిశీలిన చేసుకోవాలని వారు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి