PRINT TIME: July 01, 2026 08:58 PM
చౌటుప్పల్లో 2న కాలేజీల బంద్ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్
చౌటుప్పల్లో 2న కాలేజీల బంద్ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్
July 01, 2026 07:20 PM
9 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
బీసీ జేఏసీ పిలుపు మేరకు జూలై 2న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల (కాలేజీల) బంద్ను చౌటుప్పల్ పట్టణంలో విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజుల చెల్లింపును పాత విధానంలోనే కొనసాగించి విద్యార్థుల ఉన్నత విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బంద్ను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి