మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్
K.RAVI
13వ వార్డులో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తోందని చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డులో బుధవారం ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బత్తుల వాణి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటనే మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు మహిళా అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డులోని మహిళల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వర్కాల కుమార్ గౌడ్, మార్గం నర్సింహ్మ యాదవ్, మొగుదాల రాములు, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి, బయ్య సంపత్, మొగుదాల రాకేష్ గౌడ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి