Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్
01-07-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13వ వార్డులో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తోందని చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డులో బుధవారం ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా బత్తుల వాణి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటనే మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు మహిళా అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డులోని మహిళల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వర్కాల కుమార్ గౌడ్, మార్గం నర్సింహ్మ యాదవ్, మొగుదాల రాములు, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి, బయ్య సంపత్, మొగుదాల రాకేష్ గౌడ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

Article Image

13వ వార్డులో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తోందని చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డులో బుధవారం ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా బత్తుల వాణి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటనే మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు మహిళా అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డులోని మహిళల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వర్కాల కుమార్ గౌడ్, మార్గం నర్సింహ్మ యాదవ్, మొగుదాల రాములు, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి, బయ్య సంపత్, మొగుదాల రాకేష్ గౌడ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News