Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:45 AM

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్
02-07-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న 'చలో భూదాన్' కార్యక్రమానికి వెళ్లకుండా రామన్నపేట మండలంలోని పలువురు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు గురువారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులను పోలీసులు వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అరెస్టయిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే చాంద్, మండల అధ్యక్షుడు నోముల శంకర్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ ఇమామ్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు విమర్శించారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

Article Image

తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న 'చలో భూదాన్' కార్యక్రమానికి వెళ్లకుండా రామన్నపేట మండలంలోని పలువురు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు గురువారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులను పోలీసులు వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అరెస్టయిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే చాంద్, మండల అధ్యక్షుడు నోముల శంకర్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ ఇమామ్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు విమర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News