బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నకిరేకంటి మొగులయ్య
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నకిరేకంటి మొగులయ్య
Editor Desk
రామన్నపేట, : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రామన్నపేటకు చెందిన సీనియర్ నాయకుడు నకిరేకంటి మొగులయ్య నియమితులయ్యారు.
ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి హృదయ్ ప్రతాప్, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, గంగిడి మనోహర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ఒక కార్యకర్తగా, సైనికుడిలా కృషి చేస్తానని చెప్పారు.
తాను గతంలో బీజేపీ నల్లగొండ జిల్లా కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో పాటు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలందించినట్లు తెలిపారు. అదేవిధంగా నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తన నియామకాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. ఫోన్ ద్వారా, ప్రత్యక్షంగా కలిసి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మొగులయ్య స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి