పోక్సో బాధితులకు వేగవంతమైన సేవలు.. అన్ని శాఖల సమన్వయం కీలకం: జిల్లా ఎస్పీ
పోక్సో బాధితులకు వేగవంతమైన సేవలు.. అన్ని శాఖల సమన్వయం కీలకం: జిల్లా ఎస్పీ
Krishna
పోక్సో, అత్యాచార కేసుల్లో మహిళలు, చిన్నారులకు వేగవంతమైన న్యాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం డీజీపీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా భరోసా సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి స్టేక్హోల్డర్స్ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు.సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన అన్ని సేవలు ఒకే వేదికపై అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వారు మళ్లీ మానసిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ట్రామా హీలింగ్, కౌన్సెలింగ్, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. భరోసా సెంటర్లో మెడికల్ ఆఫీసర్ నియామకం, వైద్య నివేదికల నాణ్యత మెరుగుదల, విక్టిమ్ కాంపెన్సేషన్ కేసుల పురోగతి, చదువు మానేసిన బాధిత బాలికలకు తిరిగి విద్యా అవకాశాలు కల్పించడం, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై చర్చించారు.అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే బాధితులకు త్వరితగతిన న్యాయం, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డీఎల్ఎస్ఏ, డీఆర్డీఏ, పోలీసు శాఖ, భరోసా సెంటర్ అధికారులు, సిబ్బంది తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి