Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 10:49 PM

పోక్సో బాధితులకు వేగవంతమైన సేవలు.. అన్ని శాఖల సమన్వయం కీలకం: జిల్లా ఎస్పీ

పోక్సో బాధితులకు వేగవంతమైన సేవలు.. అన్ని శాఖల సమన్వయం కీలకం: జిల్లా ఎస్పీ

పోక్సో బాధితులకు వేగవంతమైన సేవలు.. అన్ని శాఖల సమన్వయం కీలకం: జిల్లా ఎస్పీ
July 02, 2026 09:20 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పోక్సో, అత్యాచార కేసుల్లో మహిళలు, చిన్నారులకు వేగవంతమైన న్యాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం డీజీపీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా భరోసా సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి స్టేక్‌హోల్డర్స్ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు.సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన అన్ని సేవలు ఒకే వేదికపై అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వారు మళ్లీ మానసిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ట్రామా హీలింగ్, కౌన్సెలింగ్, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. భరోసా సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్ నియామకం, వైద్య నివేదికల నాణ్యత మెరుగుదల, విక్టిమ్ కాంపెన్సేషన్ కేసుల పురోగతి, చదువు మానేసిన బాధిత బాలికలకు తిరిగి విద్యా అవకాశాలు కల్పించడం, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై చర్చించారు.అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే బాధితులకు త్వరితగతిన న్యాయం, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డీఎల్‌ఎస్‌ఏ, డీఆర్‌డీఏ, పోలీసు శాఖ, భరోసా సెంటర్ అధికారులు, సిబ్బంది తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News