మొగులయ్యకు బీజేపీ నాయకుల అభినందనలు.
మొగులయ్యకు బీజేపీ నాయకుల అభినందనలు.
Editor Desk
రామన్నపేట: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నకిరేకంటి మొగులయ్య నియమితులైన సందర్భంగా గురువారం రామన్నపేట సుభాష్ సెంటర్లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని మొగులయ్యను అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు బీజేపీలో ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగే అవకాశం బీజేపీలోనే ఉందని అన్నారు. మొగులయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులు కావడం పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్నిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణగౌడ్, మండల ఇన్చార్జి కొరివి శంకర్, మండల ప్రధాన కార్యదర్శులు జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, ఉపాధ్యక్షుడు బట్టే రమేష్, కార్యదర్శి బాత్క నరేష్, సీనియర్ నాయకులు జల్ల లక్ష్మీనారాయణ రాజు, గజం సత్యం, గోపగోని ధర్మరాజు, ఆకిటి యాదయ్య, రాపోలు విశ్వనాథం, యాదయ్య, వెంకట్, వీరమల్ల సత్యనారాయణ, గండికోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి