బస్సు కోసం విద్యార్థుల పోరుబాట మూడేళ్లుగా నిలిచిన రామన్నపేట–అమ్మనబోలు ఆర్టీసీ సర్వీసు
బస్సు కోసం విద్యార్థుల పోరుబాట మూడేళ్లుగా నిలిచిన రామన్నపేట–అమ్మనబోలు ఆర్టీసీ సర్వీసు
Editor Desk
రామన్నపేట, : రామన్నపేట–అమ్మనబోలు రూట్లో మూడేళ్లుగా ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే బస్సు సేవలను పునరుద్ధరించాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు శుక్రవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ.. ఈ రూట్ పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ప్రతిరోజూ రామన్నపేటలోని కళాశాలలు, పాఠశాలలకు రావాల్సి ఉంటుందని, ఆర్టీసీ బస్సు లేక ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
రోజుకు ఒక్కో విద్యార్థి సుమారు రూ.100 వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని, ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారిందని తెలిపారు. పలుమార్లు ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదని విమర్శించారు.
బస్సు వచ్చేదాకా ఉద్యమమే..
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే రామన్నపేట–అమ్మనబోలు రూట్లో ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నల్లగొండ ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని, బస్సు సేవలు పునరుద్ధరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్కుమార్, నాయకులు తుర్కపల్లి లోకేష్ యాదవ్, ముకిడి ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి