ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీజేపీ నాయకుడు జగదీష్ గౌడ్
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీజేపీ నాయకుడు జగదీష్ గౌడ్
Editor Desk
రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం (లోయపల్లి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని బీజేపీ నాయకుడు జగదీష్ గౌడ్ పిలుపునిచ్చారు.
లోయపల్లి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించి, కొత్తగా పేరు నమోదు చేయించుకోవడం, తప్పులు ఉంటే సరిచేయించుకోవడం, అవసరమైన మార్పులు చేయించుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని జగదీష్ గౌడ్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందుతుందని, అందువల్ల ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి