రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు మల్కాపురం విద్యార్థినులు ఎంపిక
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు మల్కాపురం విద్యార్థినులు ఎంపిక
K.RAVI
మండల పరిధిలోని దండు మల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటారు. ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి. భవ్య, 7వ తరగతి చదువుతున్న వై. రష్మిక ఈ ఘనత సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం (జూలై 2న) నల్గొండ జిల్లా చర్లపల్లిలో సబ్ జూనియర్ (అండర్-14) బాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మల్కాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థినులు పాల్గొనగా, వారిలో భవ్య, రష్మిక అద్భుత క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
నిజామాబాద్లో పోటీలు
రాష్ట్రస్థాయికి ఎంపికైన ఈ విద్యార్థినులు ఈనెల 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు తరఫున పాల్గొననున్నారు.
పాఠశాలలో సంబరాలు - అభినందనల జల్లు:
గ్రామీణ ప్రాంత పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ చాటిన విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. శోభ, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) భావనతో పాటు తోటి ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి