Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా
03-07-2026 240 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల ఎంఈవో కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం ఆందోళన.


చిట్యాల, జూలై 3: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం చిట్యాల మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేయాలని, పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీటీ ఉపాధ్యాయ పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరారు.

అలాగే మండలంలోని రెండు బీసీ హాస్టళ్ల విద్యార్థులకు ట్రంకు బాక్సులు అందించడంతో పాటు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందించని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు అరూరి ప్రణీత్, కార్యదర్శి ముసుగు రవీందర్, మండల కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శశికుమార్, గోల్చింటూ శివప్రసాద్, సంజయ్, విద్యార్థి విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా

Article Image

చిట్యాల ఎంఈవో కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం ఆందోళన.


చిట్యాల, జూలై 3: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం చిట్యాల మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేయాలని, పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీటీ ఉపాధ్యాయ పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరారు.

అలాగే మండలంలోని రెండు బీసీ హాస్టళ్ల విద్యార్థులకు ట్రంకు బాక్సులు అందించడంతో పాటు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందించని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు అరూరి ప్రణీత్, కార్యదర్శి ముసుగు రవీందర్, మండల కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శశికుమార్, గోల్చింటూ శివప్రసాద్, సంజయ్, విద్యార్థి విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News