Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
14 వ వార్డు గణేష్ నగర్‌లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:26 PM

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా
July 03, 2026 02:20 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల ఎంఈవో కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం ఆందోళన.


చిట్యాల, జూలై 3: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం చిట్యాల మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేయాలని, పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీటీ ఉపాధ్యాయ పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరారు.

అలాగే మండలంలోని రెండు బీసీ హాస్టళ్ల విద్యార్థులకు ట్రంకు బాక్సులు అందించడంతో పాటు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందించని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు అరూరి ప్రణీత్, కార్యదర్శి ముసుగు రవీందర్, మండల కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శశికుమార్, గోల్చింటూ శివప్రసాద్, సంజయ్, విద్యార్థి విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News