Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:27 PM

ట్రినిటీ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

ట్రినిటీ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

ట్రినిటీ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
July 03, 2026 02:09 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* అక్రమంగా స్టేషనరీ విక్రయాలు, అధిక ఫీజులపై ఆగ్రహం

​* పాఠశాల ముట్టడికి యత్నం.. పోలీసులతో వాగ్వాదం

* నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. చౌటుప్పల్‌లో ఉద్రిక్తత

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ ప్రైవేటు పాఠశాల వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోనే అక్రమంగా స్టేషనరీ విక్రయిస్తూ, తల్లిదండ్రుల నుంచి భారీగా సొమ్ము గుంజుతున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. యాజమాన్యం దోపిడీని అరికట్టాలని, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.​ఆందోళనలో భాగంగా విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. స్కూల్ యాజమాన్యంతో పోలీసులు కుమ్మక్కయ్యారని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.​"అక్రమంగా స్టేషనరీ అమ్ముతూ, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ట్రినిటీ పాఠశాల గుర్తింపును రద్దు చేసి, వెంటనే సీజ్ చేయాలి."

​కొద్దిసేపటి పాటు పాఠశాల ఆవరణ అంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల దోపిడీ నుంచి తల్లిదండ్రులను కాపాడాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News