Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ

చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ

చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ
03-07-2026 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 3:

చిట్యాల మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా జె. పాండు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయనను చిట్యాల మండలానికి బదిలీ చేయగా, నూతన ఎంపీడీవోగా పదవీ బాధ్యతలు చేపట్టారు.కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది జె. పాండును మర్యాదపూర్వకంగా స్వాగతించారు. అనంతరం ఆయన కార్యాలయ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, మండల అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామపంచాయతీల పరిపాలనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జె. పాండు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.మండల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Sthanikam

చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ

Article Image

చిట్యాల, జూలై 3:

చిట్యాల మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా జె. పాండు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయనను చిట్యాల మండలానికి బదిలీ చేయగా, నూతన ఎంపీడీవోగా పదవీ బాధ్యతలు చేపట్టారు.కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది జె. పాండును మర్యాదపూర్వకంగా స్వాగతించారు. అనంతరం ఆయన కార్యాలయ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, మండల అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామపంచాయతీల పరిపాలనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జె. పాండు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.మండల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News