మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలి: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలి: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండల కేంద్రంలో ఒక స్వచ్ఛంద సంస్థ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఉచిత బృహత్ ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబానికి వెన్నెముకగా నిలిచే మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఒకే చోట ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించడం ఎంతో మంచి కార్యక్రమమని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలు ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామీణ ఉపాధి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి