Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:53 AM

బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి.  ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి
03-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఇంటింటి ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.

ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందజేయడంతో పాటు, పూర్తి చేసిన వివరాలను వెంటనే యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో నకిలీ నమోదులు, అనర్హుల పేర్లు, సాంకేతిక తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా జాబితా రూపొందించాలని ఆదేశించారు.

మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, డూప్లికేట్ ఈపీఐసీ కార్డుల గుర్తింపు, నివాసం మారిన వారి వివరాల నవీకరణను బాధ్యతగా చేపట్టాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, బీఎల్ఓలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Sthanikam

బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

Article Image

చైతన్యపురి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఇంటింటి ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.

ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందజేయడంతో పాటు, పూర్తి చేసిన వివరాలను వెంటనే యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో నకిలీ నమోదులు, అనర్హుల పేర్లు, సాంకేతిక తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా జాబితా రూపొందించాలని ఆదేశించారు.

మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, డూప్లికేట్ ఈపీఐసీ కార్డుల గుర్తింపు, నివాసం మారిన వారి వివరాల నవీకరణను బాధ్యతగా చేపట్టాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, బీఎల్ఓలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News