కన్నులపండువగా శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణం. భక్తుల రద్దీ మధ్య వైభవంగా బ్రహ్మోత్సవాలు.
కన్నులపండువగా శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణం. భక్తుల రద్దీ మధ్య వైభవంగా బ్రహ్మోత్సవాలు.
Editor Desk
చైతన్యపురి
దిల్సుఖ్నగర్లోని గడ్డి అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో జరుగుతున్న ద్వితీయ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్తో పాటు వేద పండితులు లక్ష్మీనారాయణ హోమం, లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దేవరం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చకిలం రమణయ్య, కోశాధికారి వక్కలంక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పాల్తి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి భాషపాక సంతోష్, మాజీ చైర్మన్ సూరిశెట్టి వీరేశం, చిదర నాగేందర్, ఊర నరసింహ గుప్తా, బచ్చు సత్యనారాయణ, ప్రొద్దుటూరి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి