Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:52 AM

కన్నులపండువగా శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణం. భక్తుల రద్దీ మధ్య వైభవంగా బ్రహ్మోత్సవాలు.

కన్నులపండువగా శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణం. భక్తుల రద్దీ మధ్య వైభవంగా బ్రహ్మోత్సవాలు.

కన్నులపండువగా శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణం.  భక్తుల రద్దీ మధ్య వైభవంగా బ్రహ్మోత్సవాలు.
03-07-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి

దిల్‌సుఖ్‌నగర్‌లోని గడ్డి అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో జరుగుతున్న ద్వితీయ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్‌తో పాటు వేద పండితులు లక్ష్మీనారాయణ హోమం, లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దేవరం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చకిలం రమణయ్య, కోశాధికారి వక్కలంక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పాల్తి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి భాషపాక సంతోష్, మాజీ చైర్మన్ సూరిశెట్టి వీరేశం, చిదర నాగేందర్, ఊర నరసింహ గుప్తా, బచ్చు సత్యనారాయణ, ప్రొద్దుటూరి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కన్నులపండువగా శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణం. భక్తుల రద్దీ మధ్య వైభవంగా బ్రహ్మోత్సవాలు.

Article Image

చైతన్యపురి

దిల్‌సుఖ్‌నగర్‌లోని గడ్డి అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో జరుగుతున్న ద్వితీయ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్‌తో పాటు వేద పండితులు లక్ష్మీనారాయణ హోమం, లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దేవరం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చకిలం రమణయ్య, కోశాధికారి వక్కలంక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పాల్తి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి భాషపాక సంతోష్, మాజీ చైర్మన్ సూరిశెట్టి వీరేశం, చిదర నాగేందర్, ఊర నరసింహ గుప్తా, బచ్చు సత్యనారాయణ, ప్రొద్దుటూరి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News