చైతన్యపురి
బీఎల్ఓలు అందజేస్తున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేసి అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆర్కే పురం డివిజన్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన వివరాలతో ఫారాలు నింపడం ద్వారా తప్పులులేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో బీఎల్ఓలు సుమలత, మమత, రాంబాబు, సూపర్వైజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి