Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:25 PM

గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి

గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి

గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి
July 03, 2026 07:58 PM 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్‌జీ కళాశాలలో విషాదం.. అధ్యాపకులు, విద్యార్థుల సంతాపం

నల్గొండ: నాగార్జున ప్రభుత్వ (ఎన్‌జీ) కళాశాలలో ఎం.ఏ. తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కంపటి శోభ (23) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందినట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ తెలిపారు.

కోదాడకు చెందిన కంపటి శ్రీను, సుజాత దంపతుల రెండో కుమార్తె శోభకు 12 రోజుల క్రితం గుండె నొప్పి రావడంతో నల్లగొండలోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం గుండె పనిచేయడం ఆగిపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ప్రతిభావంతమైన విద్యార్థిని అకాల మరణం కళాశాల వర్గాలను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. శోభ మృతిపట్ల వైస్ ప్రిన్సిపాల్ డా. అంతటి శ్రీనివాసులు, తెలుగు శాఖాధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు శ్రవణ్ కుమార్, వనజ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News