గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి
గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి
Editor Desk
ఎన్జీ కళాశాలలో విషాదం.. అధ్యాపకులు, విద్యార్థుల సంతాపం
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ (ఎన్జీ) కళాశాలలో ఎం.ఏ. తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కంపటి శోభ (23) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందినట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ తెలిపారు.
కోదాడకు చెందిన కంపటి శ్రీను, సుజాత దంపతుల రెండో కుమార్తె శోభకు 12 రోజుల క్రితం గుండె నొప్పి రావడంతో నల్లగొండలోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం గుండె పనిచేయడం ఆగిపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ప్రతిభావంతమైన విద్యార్థిని అకాల మరణం కళాశాల వర్గాలను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. శోభ మృతిపట్ల వైస్ ప్రిన్సిపాల్ డా. అంతటి శ్రీనివాసులు, తెలుగు శాఖాధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు శ్రవణ్ కుమార్, వనజ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి