Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:22 PM

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు స్థానాల భర్తీపై దృష్టి

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు స్థానాల భర్తీపై దృష్టి

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు.  గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు స్థానాల భర్తీపై దృష్టి
04-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమరావతి, : గవర్నర్ కోటాలో ఈ నెలాఖరుతో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.


ప్రస్తుతం మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం ఈ నెల 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్ఠానం సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.


ఒక ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ నేత వర్ల రామయ్య పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడికి లేదా బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేతకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


అయితే, అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టీడీపీ అధిష్ఠానం తుది నిర్ణయం అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Sthanikam

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు స్థానాల భర్తీపై దృష్టి

Article Image

అమరావతి, : గవర్నర్ కోటాలో ఈ నెలాఖరుతో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.


ప్రస్తుతం మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం ఈ నెల 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్ఠానం సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.


ఒక ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ నేత వర్ల రామయ్య పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడికి లేదా బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేతకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


అయితే, అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టీడీపీ అధిష్ఠానం తుది నిర్ణయం అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News