ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు స్థానాల భర్తీపై దృష్టి
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు స్థానాల భర్తీపై దృష్టి
Editor Desk
అమరావతి, : గవర్నర్ కోటాలో ఈ నెలాఖరుతో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్రస్తుతం మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం ఈ నెల 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్ఠానం సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
ఒక ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ నేత వర్ల రామయ్య పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడికి లేదా బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేతకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టీడీపీ అధిష్ఠానం తుది నిర్ణయం అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి