PRINT TIME: July 05, 2026 05:58 PM
దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
July 04, 2026 01:49 PM
17 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన దివంగత ఈర శంకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని శనివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, గ్రామ యువత ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ,శంకర్ రెడ్డి, జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, వారు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొనగా, యువత సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి