ఏరియా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ. శిథిల భవనంపై స్థానికుల వినతి.. స్పందించిన డిప్యూటీ కలెక్టర్
ఏరియా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ. శిథిల భవనంపై స్థానికుల వినతి.. స్పందించిన డిప్యూటీ కలెక్టర్
Editor Desk
అభా' యాప్లోనే హాజరు నమోదు చేయాలి
రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృతిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, హాజరు రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ఇకపై తప్పనిసరిగా 'అభా' (ABHA) డిజిటల్ విధానం ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించారు.
అనంతరం జనరల్ వార్డులు, ఓపీ విభాగాన్ని సందర్శించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వర్షాలకు పైకప్పు నుంచి నీరు కారడంతో పాటు పెచ్చులు ఊడిపడుతున్నాయని స్థానికులు, రోగులు డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రోగులు, వైద్య సిబ్బంది ప్రాణభయంతో విధులు నిర్వహిస్తున్నారని, వెంటనే కొత్త ఆస్పత్రి భవనం మంజూరు చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన డిప్యూటీ కలెక్టర్ కృతిక.. భవన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తనిఖీలో వైద్యులు అలివేలు, శ్వేత ప్రియాంక, స్వాతిబాయి, నవీన్ సింగ్, మాధవాచారి, సపోర్టింగ్ ఇంజనీర్ శోభనతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి