విప్ వీరేశం నూతన ఛాంబర్ ప్రారంభం.
విప్ వీరేశం నూతన ఛాంబర్ ప్రారంభం.
Editor Desk
మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్ సమక్షంలో ప్రారంభోత్సవం
హైదరాబాద్
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విప్ ఛాంబర్ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హాజరై వీరేశానికి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్రెడ్డి, ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, యెన్నం శ్రీనివాస్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వేముల వీరేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ విప్గా ప్రజాసేవలో మరింత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి