చేనేత సహకార సంఘం బలోపేతమే లక్ష్యం
చేనేత సహకార సంఘం బలోపేతమే లక్ష్యం
Biksham
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గండూరి రమేష్
చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్యులందరినీ కలుపుకొని కృషి చేస్తానని సంఘ నూతన అధ్యక్షుడు గండూరి రమేష్ తెలిపారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో డైరెక్టర్ల సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గండూరి రమేష్, ఉపాధ్యక్షుడిగా చిలివేరు నరసింహారావు, కార్యదర్శిగా భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ముషం హరిప్రసాద్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షేక్ బాజీ ప్రకటించారు.
అనంతరం నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గండూరి రమేష్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యులు, డైరెక్టర్లు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూతన డైరెక్టర్లు ముషం యాదమ్మ, విడం నీరజ, పెద్ది శ్రీనివాస్, యాలగందుల లక్ష్మయ్య, యాలగందుల సాయినేతతో పాటు సంఘ నాయకులు కడారి బిక్షం, బాల్నే మల్లయ్య, యాలగందుల సుదర్శన్, దూలం నగేష్, ఎస్. రాములు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి