వేంకటేశ్వరస్వామి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ విక్రమ్.
వేంకటేశ్వరస్వామి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ విక్రమ్.
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలోని అతి ప్రాచీన శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురాతన దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, వాటి ఆధునికీకరణకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు విరాళాలు అందించి పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, రేపాక పారిజాత, పుట్టల లక్ష్మమ్మ, వడ్లకొండ లక్ష్మి, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహ, చిన్నపాక శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్, పాలసంఘం చైర్మన్ కంబాలపల్లి శ్రీశైలం, సింగణబోయిన మల్లేశం, పగుడాల వెంకటేశం, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి