Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

లింగ నిర్ధారణ ముఠాపై పోలీసుల మెరుపుదాడి నకిరేకల్‌లో గుట్టు రట్టు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్

లింగ నిర్ధారణ ముఠాపై పోలీసుల మెరుపుదాడి నకిరేకల్‌లో గుట్టు రట్టు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్

లింగ నిర్ధారణ ముఠాపై పోలీసుల మెరుపుదాడి నకిరేకల్‌లో గుట్టు రట్టు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్
08-07-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారం కలకలం రేపింది. శివాజీనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న దందాపై నకిరేకల్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ప్రధాన నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో చివ్వెంల మండల గర్భిణి మరణం కేసులోనూ నిందితులుగా ఉన్న వీరు, జైలు శిక్ష అనుభవించినప్పటికీ తిరిగి ఇదే అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు సమాచారం.

కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీల సహకారంతో గర్భిణీలను రప్పించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు, నిందితులతో సంబంధాలున్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. చట్టాన్ని ధిక్కరించి గర్భస్థ శిశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Sthanikam

లింగ నిర్ధారణ ముఠాపై పోలీసుల మెరుపుదాడి నకిరేకల్‌లో గుట్టు రట్టు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్

Article Image

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారం కలకలం రేపింది. శివాజీనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న దందాపై నకిరేకల్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ప్రధాన నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో చివ్వెంల మండల గర్భిణి మరణం కేసులోనూ నిందితులుగా ఉన్న వీరు, జైలు శిక్ష అనుభవించినప్పటికీ తిరిగి ఇదే అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు సమాచారం.

కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీల సహకారంతో గర్భిణీలను రప్పించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు, నిందితులతో సంబంధాలున్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. చట్టాన్ని ధిక్కరించి గర్భస్థ శిశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News