లింగ నిర్ధారణ ముఠాపై పోలీసుల మెరుపుదాడి నకిరేకల్లో గుట్టు రట్టు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్
లింగ నిర్ధారణ ముఠాపై పోలీసుల మెరుపుదాడి నకిరేకల్లో గుట్టు రట్టు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా నకిరేకల్లో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారం కలకలం రేపింది. శివాజీనగర్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న దందాపై నకిరేకల్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ప్రధాన నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో చివ్వెంల మండల గర్భిణి మరణం కేసులోనూ నిందితులుగా ఉన్న వీరు, జైలు శిక్ష అనుభవించినప్పటికీ తిరిగి ఇదే అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు సమాచారం.
కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీల సహకారంతో గర్భిణీలను రప్పించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు, నిందితులతో సంబంధాలున్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. చట్టాన్ని ధిక్కరించి గర్భస్థ శిశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి