PRINT TIME: July 09, 2026 10:05 PM
ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు సన్నాహాలు
ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు సన్నాహాలు
July 08, 2026 05:37 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
19న గుర్రంపొడ్లో నిర్వహణ.. కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు.
నల్లగొండ, జూలై 8: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా 11వ మహాసభలను ఈ నెల 19న గుర్రంపొడ్లో విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతీకరించి, కనీస వేతనాల చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి