Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 09, 2026 09:40 PM

డిగ్రీ చదువుకు అడుగుపెట్టిన సినీ నటుడు రాహుల్ రామకృష్ణ

డిగ్రీ చదువుకు అడుగుపెట్టిన సినీ నటుడు రాహుల్ రామకృష్ణ

డిగ్రీ చదువుకు అడుగుపెట్టిన సినీ నటుడు రాహుల్ రామకృష్ణ
July 09, 2026 07:55 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరిక.. పుస్తకాలు అందజేసిన వీసీ ఘంటా చక్రపాణి


హైదరాబాద్, జూలై 9: ‘భరత్ అనే నేను’ సినిమా ఫేం సినీ నటుడు రాహుల్ రామకృష్ణ డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో చేరారు. గురువారం విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆయన అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణిను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి రాహుల్ రామకృష్ణకు అభినందనలు తెలియజేసి బీఏ కోర్సుకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. అనంతరం మాట్లాడిన రాహుల్ రామకృష్ణ, ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయిన వారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో నిలిపివేసిన వారు, గృహిణులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక వరమని పేర్కొన్నారు.

ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా విద్య మనిషికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందని ఆయన అన్నారు. తాను ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు తిరిగి విద్యాభ్యాసం కొనసాగించేందుకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చేరినట్లు తెలిపారు.ఇటీవలి కాలంలో వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి తీసుకుంటున్న నిర్ణయాలు తనను ఆకట్టుకున్నాయని, ఆదివాసీ తెగలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత విద్యను అందిస్తూ సమాన అవకాశాలు కల్పించడం అభినందనీయమని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు.

విద్యకు వయస్సుతో సంబంధం లేదని, జీవితాంతం నేర్చుకునే ప్రక్రియ కొనసాగాలని ఆయన సందేశం ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News