బడుగు మోహన్ ప్యానెల్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం
బడుగు మోహన్ ప్యానెల్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం
K.RAVI
* చేనేత కార్మికులను కలిసి ఓటు వేయాలని కోరిన వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్
* చేనేత సంఘం అభివృద్ధికి పారదర్శక పాలన అవసరం
చేనేత సహకార సంఘం ఎన్నికల వేడి పెరిగింది. అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడుగు మోహన్ ప్యానెల్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన వివిధ కాలనీలు, వీధుల్లో పర్యటించి చేనేత కార్మికులను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించారు. చేనేత సహకార సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, పారదర్శక పాలనే ధ్యేయంగా బడుగు మోహన్ ప్యానెల్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయాలంటే సేవా భావం కలిగిన నాయకత్వం అవసరమని, అందుకు బడుగు మోహన్ నాయకత్వమే సరైనదని ఆయన పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో బడుగు మోహన్ ప్యానెల్ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బడుగు మోహన్ పోటీ చేస్తుండగా.. డైరెక్టర్లుగా కాటబత్తిని భీమయ్య, గోశిక నరసింహ, గోశిక లక్ష్మీపతి, గోశిక శ్రీకాంత్, దోర్నాల లక్ష్మీనారాయణ, పాపని రామకృష్ణ తమ ప్యానెల్ మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా నాయకులు మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటానికి తమ ప్యానెల్ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. సభ్యులంతా ఐక్యంగా ముందుకు వచ్చి తమ ప్యానెల్ అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో ప్యానెల్ అభ్యర్థులు, చేనేత సహకార సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి