బాలికల హక్కులు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత:జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి
బాలికల హక్కులు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత:జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి
Krishna
జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం ఝరాసంగం మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే నివాస పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె. లలిత కుమారి మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం, మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, అత్యవసర సహాయ సేవలు, సామాజిక మాధ్యమాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆడపిల్లల విద్య ప్రాముఖ్యత, మహిళల భద్రత, సాధికారత వంటి అంశాలపై విద్యార్థినులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ప్రతి బాలిక తన హక్కులు తెలుసుకుని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిశు అభివృద్ధి అధికారులు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, వైద్యాధికారి, మహిళా సహాయ కేంద్రం ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమీకృత శిశు అభివృద్ధి సేవల పర్యవేక్షకులు, పోలీసు శాఖ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి