Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..! నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 08, 2026 10:56 PM

జులై 14 జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేయాలి: తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్

జులై 14 జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేయాలి: తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్

జులై 14 జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేయాలి: తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్
July 08, 2026 08:59 PM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ జులై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న జిల్లాస్థాయి ధర్నాను ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


ప్రభుత్వం 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ (PRC)ని ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే జనవరి 2024 నుంచి ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జులై 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు.


ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జులై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు.


ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి రమేష్, రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ సత్తారి రాజిరెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు భీమ్లా నాయక్, జిల్లా బాధ్యులు శివరంజని, యాదగిరి, సుజాత, భాగ్యమ్మ, మండల అధ్యక్షులు రావుల శివకుమార్, దత్తాత్రేయ, రాజేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News