Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
08-07-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్‌ఐఆర్ అవగాహన, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను సందర్శించారు. అక్కడి వ్యాపారులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన రోజువారీ వ్యాపారం, ఆదాయం, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల సమస్యలు, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ పనితీరుపై కూడా వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, లాడే మల్లేశం, మసూద్, శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Article Image

అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్‌ఐఆర్ అవగాహన, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను సందర్శించారు. అక్కడి వ్యాపారులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన రోజువారీ వ్యాపారం, ఆదాయం, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల సమస్యలు, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ పనితీరుపై కూడా వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, లాడే మల్లేశం, మసూద్, శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News