స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
Krishna
అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ అవగాహన, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను సందర్శించారు. అక్కడి వ్యాపారులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన రోజువారీ వ్యాపారం, ఆదాయం, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల సమస్యలు, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ పనితీరుపై కూడా వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, లాడే మల్లేశం, మసూద్, శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి