తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఇరువురు చర్చించారు.ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులు చురుకైన పాత్ర పోషించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు.
ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ భేటీలో చిట్టిమల్ల అంజయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి