: ఇటీవల నాగిరెడ్డిపల్లి (ఎంబవి) గ్రామానికి చెందిన క్యాసాని వెంకటమ్మ మృతిచెందిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన వంతు సహాయంగా రూ.20,000 ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ఇటీవల మృతిచెందిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిమినేటి మణెమ్మ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కుటుంబాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి