ఆటో డ్రైవర్ నరేష్ నిజాయితీకి సెల్యూట్.. సీఐ చేతుల మీదుగా ఘన సత్కారం
ఆటో డ్రైవర్ నరేష్ నిజాయితీకి సెల్యూట్.. సీఐ చేతుల మీదుగా ఘన సత్కారం
Komidala Mahender reddy
నల్లగొండ, జూలై 16: నేటి సమాజంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి యజమానుల చేతికి చేరడం అరుదుగా మారుతున్న వేళ, ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. నల్లగొండకు చెందిన ఆటో డ్రైవర్ నరేష్, ప్రయాణికురాలు ఆటోలో మరిచిపోయిన బ్యాగును వెంటనే గుర్తించి పోలీసులకు అప్పగించి తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.
బ్యాగులో సెల్ఫోన్తో పాటు రూ.4 వేల నగదు మరియు ఇతర విలువైన వస్తువులు ఉండగా, వాటిని క్షేమంగా బాధితురాలికి అందజేయడంలో వన్టౌన్ పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ నరేష్ నిజాయితీని అభినందిస్తూ వన్టౌన్ సీఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి శాలువాతో సత్కరించి ప్రశంసించారు.
కాగా, నరేష్కు ఇది మొదటి సందర్భం కాదు. గతంలో కూడా రూ.14 వేల నగదు, సెల్ఫోన్ ఉన్న బ్యాగును యజమానికి అప్పగించి మంచి పేరు తెచ్చుకున్నాడు. వరుసగా రెండోసారి తన నిజాయితీని నిరూపించుకున్న నరేష్పై స్థానికులు, పోలీసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
"నిజాయితీ ఉంటేనే నమ్మకం నిలుస్తుంది" అనే సందేశాన్ని తన ఆచరణతో మరోసారి చాటి చెప్పిన ఆటో డ్రైవర్ నరేష్ పలువురికి ఆదర్శంగా నిలిచాడు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి