Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:34 AM

నిద్రలో ఉన్న యువకుడిపై గొడ్డలితో దాడి.. సూర్యాపేటలో సంచలనం

నిద్రలో ఉన్న యువకుడిపై గొడ్డలితో దాడి.. సూర్యాపేటలో సంచలనం

నిద్రలో ఉన్న యువకుడిపై గొడ్డలితో దాడి.. సూర్యాపేటలో సంచలనం
16-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


గంజాయి అలవాటు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన.. తల్లిపై అనుమానంతో పోలీసుల దర్యాప్తు.


సూర్యాపేట, జూలై 15:

సూర్యాపేట పట్టణంలో ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. భూక్యా విజయ్ అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తలపై గొడ్డలితో దాడి జరగడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం, విజయ్ కొంతకాలంగా గంజాయికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని, ముఖ్యంగా తన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తరచూ గొడవలకు దిగేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాల కోణాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, విజయ్ తల్లి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

Sthanikam

నిద్రలో ఉన్న యువకుడిపై గొడ్డలితో దాడి.. సూర్యాపేటలో సంచలనం

Article Image


గంజాయి అలవాటు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన.. తల్లిపై అనుమానంతో పోలీసుల దర్యాప్తు.


సూర్యాపేట, జూలై 15:

సూర్యాపేట పట్టణంలో ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. భూక్యా విజయ్ అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తలపై గొడ్డలితో దాడి జరగడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం, విజయ్ కొంతకాలంగా గంజాయికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని, ముఖ్యంగా తన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తరచూ గొడవలకు దిగేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాల కోణాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, విజయ్ తల్లి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News